అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలు చోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను (Assembly Candidates) మార్చివేసింది .
పాడేరు (Paderu) నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు(Raghurama Raju) , శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్కుమార్పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana ) కి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో రామకృష్ణకు బీ ఫారమ్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) ఆదివారం ఉండవెల్లి నివాసంలో అందజేశారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటికి పొత్తు కుదిరింది. ఇక జనసేనల 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి పొత్తులు కుదిరాయి.