అమరావతి : చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. గడిచిన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అబద్దాలే ఆయనకు ప్రాధాన్యమని అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కరువుకాటకాల్లో తక్షణ సహాయంగా ఏమి అందించలేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఉంటే వర్షాలు కూడా సక్రమంగా పడవని విమర్శించారు. విపత్తులు సంబవించినప్పుడు ఆయన అధికారులను నిద్రించేవాడు కాదని, వారిని పనిని చేయించేవాడు కూడా కాదని దీంతో అధికారులు తలపట్టుకునే వారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుతో కిందిస్థాయి నుంచి వ్యవస్థ బలోపేతంగా ఉందని అన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.