అమరావతి : కుటిల రాజకీయాలతోనే కాలం వెల్లదీస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆగడాలు ఇకపై కుప్పం నియోజయకవర్గంలో కొనసాగవని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ మీడియా తో మాట్లాడారు. ఇటీవల కుప్పంలో పర్య టించిన చంద్రబాబు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారని ఆరోపించారు.
వైసీపీ వారిపైనే టీడీపీ నాయకులు, పోలీసులు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. తమవారిపై దాడులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కుప్పంలో ఏడు వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. సెక్యూరిటీని పెంచుకోవడానికే దాడుల నాటకం ఆడారని అనుమానం వ్యక్తం చేశారు. కుప్పంలో కెనాల్ పూర్తి చేసే ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.