తిరుమల : తిరుమల లడ్డూ ( Tirupati laddus ) లో జంతువుల కొవ్వు కలిపారని నిన్న, మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu) ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందని బాంబు పేల్చారు. కల్తీ నెయ్యిలో బాత్రూం క్లీన్లో ఉపయోగించే లప్సా కెమికల్ను కలిపారని సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments) చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు డిజిటల్ పాస్బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేసి మహాపాపం చేశారని నాటి వైసీపీ నాయకులపై మండిపడ్డారు. సీబీఐ, సిట్ ఏమీ లేదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక వెల్లడించిందని అన్నారు.
బాత్రూములు కడిగే కెమికల్స్తో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యితో ఐదేళ్లు ప్రసాదం చేసి ప్రజలకు పంపిణీ చేశారని వెల్లడించారు. శ్రీశైలం కూడా కల్తీ జరిగిందని ఆరోపించారు. లడ్డూ తయారీలో కొన్ని కెమికల్ వాడతారని వివరించారు. వెజిటెబుల్ కొవ్వు వాడితే ఎక్కువ రేట్, యానిమల్ కొవ్వు వాడితే తక్కువ రేటుకు దొరికే నెయ్యిని వాడారని అన్నారు.
తిరుమల లడ్డూ విషయాన్ని తానూ మాడ్లావద్దని అనుకున్నానని, కాని వేంకటేశ్వరస్వామి పవిత్రత కోసం ఆలోచించి ఈ విషయాన్ని బయటపెట్టానని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసి తనపై నెపం వేశారని తాను మౌనంగా ఉంటే తిరుమల లడ్డూ కల్తీని తనపై రుద్దేవారని ఆందోళన వ్యక్తం చేశారు.