అమరావతి : ఏపీలో వైఎస్ జగన్(YS Jagan) పాలన అరాచకానికి అడ్రస్గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం(compensation) చెల్లించాలని అనంతపురం రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడం విచారకరమని అన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతులకు ఎంత బీమా కట్టారో వెల్లడించాలన్నారు. పంట నష్టం వివరాలను ప్రకటించాలని కోరారు. రైతులపై కేసులు పెట్టినందుకు రైతులకు క్షమాపణ( Apology ) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.