అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ కుప్పం నియోజక వర్గానికి ఏమి చేయలేకపోయారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బాబు కుప్పం నుంచి పోటీ చేయరని, చేసినా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు ను, టీడీపీని తరిమి కొట్టే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.
దివంగత ఎన్టీఆర్ అంటే తమకు ఎనలేని అభిమానం ఉండడం వల్లే ఎన్టీఆర్ పేరిట జిల్లాను ఏర్పాటు చేశా మని వెల్లడించారు. మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్టీ ఆర్ పేరు ప్రస్తావించే అర్హత లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పేరును మార్చినపుడు తామేమైనా ప్రభుత్వాన్ని నిలదీశామా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అబద్దాల పుట్టని విమర్శించారు.