అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు రేపు(సోమవారం) సారాబాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఇటీవల సారా తాగి తీవ్ర అస్వస్థతకు గురై 18 మంది గ్రామస్థులు మరణించారు. మరొకొందరు సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడానికి గాను గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు.
మద్యనిషేదం దశల వారీగా విధిస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ను, సారా తయారీని ప్రోత్సహించడం వల్లే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చంద్రబాబు ఆరోపిం చారు. ఇటీవల జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. కల్తీసారా కారణంగా.. బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు. కల్తీసారాను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.