అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. బాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీ నాయకులతో సఖ్యంగా ఉంటున్న పవన్కల్యాణ్ రాబోయే ఎన్నికల్లోనూ బాబుతో కలిసి పనిచేయడానికి ఉత్సహం చూపుతున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మను దర్శించుకుని ఆలయ అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గత పుట్టిన రోజులకు భిన్నంగా ఈసారి ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రామంలోని కొందరి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడి గ్రామసభలో పాల్గొననున్నారు. స్థానికులతో సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, బొండా ఉమ, యరపతినేని, టీడీ జనార్ధన్ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద టీడీపీ శ్రేణులు 1, 116 కొబ్బరికాయలు కొట్టారు.