అమరావతి : రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు ఆరోపించారు. ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర చేస్తోందని, రాజధానుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
స్థానికంగా మద్దతు లేక పోవడంతో బయట నుంచి జనాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తప్పా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసమే అభివృద్ధి పనులకు అడ్డుపడుతు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టిన ఇంకా బుద్ధిరాలేదని ఆరోపించారు.