అమరావతి : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పై ఆసక్తికర ట్వీట్(Tweet) చేశారు. జూన్ 4వ తేదీన వెలువడే ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలను తనదైనశైలీలో విశ్లేషించారు. 2014లో 23 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో మే 23న జరిగిన కౌంటింగ్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు.
చంద్రబాబూ…!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.ఈసారి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024
ఈసారి వైసీపీ (YCP) కి చెందిన నలుగురిని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం నారాయణరెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ చేసిన ట్విట్ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది . ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి…నీ మీద జాలేస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.