అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలు అని తీసుకుని నేడు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా పోరాడుతున్నామని పేర్కొన్నారు. అప్పటికి, ఇప్పటికీ మడమతిప్పని విధంగా ఒకే మాటపై కట్టుబడి ఉన్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. వారి నిర్ణయం బట్టి ఆదారపడి ఉంటుందని, అయినా ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి, ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి మేం రాజీనామా చేస్తాం.. మీరు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ ప్రజల్లో టీడీపీకి ప్రజల్లో బలం ఎంత ..? ఓటింగ్ శాతం ఎంతా..? ఎంపీలు ఎంత మంది ఉన్నారు. ఆయన చెబితే మేం రాజీనామా చేయాలా అని ప్రశించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించలేదని అంబటి రాంబాబు గుర్తు చేశారు.