అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేసి విజయవాడ తాడేపల్లిలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించారు. నంద్యాల నుంచి ఉదయం 8 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసి అక్కడి నుంచి తొమ్మిది గంటల పాటు కాన్వాయ్ ద్వారా వివిధ మార్గాల గుండా విజయవాడకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సిట్ కార్యాలయానికి తరలించారు. సుమారు 2వందల మంది పోలీసులు బందోబస్తును నిర్వహించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు తరుఫున వాదించడానికి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా హుటాహుటినా ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ట్పోర్టుకు చేరుకున్నారు.