ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంత్య క్రియలు ఆదివారం ముగిశాయి. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తిలోని ఊరందూరులో అంత్యక్రియలు ముగిశాయి. ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలకు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు విశేషంగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పాడెను మోశారు. బొజ్జల పార్థివ దేహాన్ని ఆయన కుటుంబీకులు శనివారం విమానంలో తిరుపతి ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఓ గంట పాటు కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం వుంచారు. అనంతరం తన స్వగ్రామమైన ఊరందుకు తరలించారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.