అమరావతి : ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) పేర్కొన్నారు. చంద్రబాబు (Chandra babu) బాటలో నడుస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) కూడా ఎన్నికలతో రాజకీయ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. పెనమలూరులో సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడారు.
పవన్ ఎందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టారో ఆయనకే తెలియదని విమర్శించారు. పార్టీ నాయకుడిగా తన ఆలోచనల్లో ఎన్నడూ స్పష్టత లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎదగలనుకునే నాయకుడికి స్పష్టమైన ఆలోచనలు ఉండాలని సూచించారు. చంద్రబాబు ఏది చెబితే అదే పవన్కల్యాణ్ చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాడని దుయ్యబట్టారు.
ఎన్నికల్లో జగన్ను ఒంటరిగా ఎదుర్కొనలేక చంద్రబాబు కూటమిగా వస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీని గెలిపించాలని నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. వైసీపీ చేపట్టిన చేపట్టిన సిద్ధం, మేమంతా సిద్ధం జగన్ కార్యక్రమాలు అన్ని చోట్ల విజయవంతమయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టత ఉందని జగన్ ఒక వైపు, కూటమిసభ్యులంతా ఒకవైపు ఉన్నా ప్రజలు జగన్ వైపే ఉన్నారని వివరించారు.