తిరుపతి : తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) ఆదివారం శాస్త్రోక్తంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా కామాక్షి అమ్మవారి హోమం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపటి (సోమవారం) నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుందని ఆలయ అధికారులు వెల్లడించారు.