అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అ్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. రాయలసీమలో విస్తృతంగా నెల్లూరులో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది .