అమరావతి : చర్చల పేరుతో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను పక్కదోవ పట్టించిందిన పీఆర్సీ సాధన సమితి నాయకులు ఆరోపించారు. అమరావతిలో సమావేశమైన సాధన సమితి నాయకులు పలు ఉద్యమ కార్యాచరణ అమలు తదితర అంశాలపై చర్చను నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులను అవమాన పరిచేలా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడరని ఆరోపించారు. ప్రభుత్వా న్ని నమ్మి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మోసపోయారని పేర్కొన్నారు .
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఫిబ్రవరి 3న నిర్వహిస్తున్న చలో విజయవాడకు రాష్ట్రంలోని ఉద్యోగులందరూ లక్షలాధి సంఖ్యలో హాజరు కావాలని సాధన సమితి నాయకులు బండి శ్రీనివాస్, సూర్యనారాయణ, వెంకట్రాంరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యమంపై న్యాయ సలహాలు ఇచ్చేందుకు రవిప్రసాద్, సత్యప్రసాద్ అనే ఇద్దరు న్యాయవాదులను నియమించుకున్నట్లు వారు వెల్లడించారు.