అమరావతి : బీజేయేతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దారుణంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన వైసీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు.
41 శాతం పన్నుల వాటా ఇస్తున్నామని కేంద్రం చేస్తున్న ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం తాను చేస్తున్న అప్పుల సంగతి చెప్పడం లేదని విమర్శిం చారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే బీజేపీ, టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.