అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను పట్టుకునేందుకు సీబీఐ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. కేసుకు దర్యాప్తులో కీలక, విశ్వసనీయ సమాచారం అందిస్తే రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని ఇవాళ ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ అధికారులు తెలిపారు. సమాచారం ఇవ్వాలకునే వారు ఫోన్లోగానీ నేరుగా కార్యాలయంలో తమను సంప్రదించాలని సూచించారు. వివేకా హత్య కేసును సీబీఐ గత 75 రోజులుగా దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక అనుమానితులను సీబీఐ విచారించింది. వారి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసింది. సీబీఐ విచారించిన జాబితాలో వివేకా కుటుంబ సన్నిహితులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్కు నమ్మకస్తులు కూడా ఉన్నారు.