అమరావతి : టీడీపీ నాయకులు(TDP leaders) , కార్యకర్తలపై ఎన్నికేసులు పెట్టినే తగ్గేదేలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లను రెడ్బుక్ ( Red book) లో రాశానని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పలాస నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్గా చేస్తే వైసీపీ గంజాయి క్యాపిటల్గా చేసిందని ఆరోపించారు.
విశాఖ జిల్లాలో వైసీపీ నేతల వేధింపులతో అధికారుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించి, ఎన్నికల ముందు 6వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఏటా డీఎస్సీని వేస్తామని ప్రకటించారు. గడిచిన ఐదేండ్లలో జగన్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచారని ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించుకొంటామని లోకేష్ వెల్లడించారు.