అమరావతి : శుభకార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా (prakasam district ) కనిగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా ( Car overturned ) పడింది. కారులో ఉన్న తండ్రీకుమారుడు మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలు కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు.
మృతులు నెల్లూరు జిల్లా మర్రిపాడు వాసులుగా గుర్తించారు. గుంటూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది . పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.