అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికకు నిర్వహిస్తున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెదురుముదురు సంఘటనలు మినహా ఎలాంటి ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నాం ఒంటి గంటకు పోలింగ్ 44.14 శాతం నమోదు కాగా మరో రెండు గంటల్లో మరో 11 శాతం పోలింగ్ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి మణిమంజరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతుంది.
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో వైసీపీ, బీజేపీ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,13,388 మంది ఓటర్లు తమ ఓటుహక్కు
వినియోగించుకోనున్నారు.