అమరావతి : ఏపీలో మూడు రాజధానుల నిర్మాణం కష్టమైన పని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మూడు చోట్లకు వెళ్లాలంటే ఇబ్బందేనని వెల్లడించారు. రాష్ట్రవిభజన సమయంలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం నిధులు ఇవ్వ కుండా విస్మరించిందని అన్నారు.
అమరావతి అభివృద్ధికి నిధులు ఇచ్చే అంశాన్ని ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో అమరావతికి వచ్చినప్పుడు రాజధాని నిర్మాణ పనులు చురకుగా జరుగుతున్న విషయాన్ని గమనించానని ఇప్పుడు పనులు నిలిచిపోయినట్లు కనపడుతుందని అన్నారు.