అమరావతి : చదువుపై ఒత్తిడి తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రమోద్ అనే బీటెక్ విద్యార్థి వరంగల్ నీట్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా చదువు కోలేక పోతున్నానని, దీంతో ఒత్తిడికి గురై చనిపోతున్నట్లు సూసైడ్ లేఖను రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లేఖను జంగారెడ్డి గూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్ బాబు తెలిపారు.