హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ జాతీయ అధినేత, సీఎం కేసీఆర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను పార్టీ అభిమానులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుతో ఏపీ ప్రజల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, విజయవాడ, యానాం, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, ముక్కామల వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ నెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఈ సభపై ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.