తిరుమల: రేపు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనున్నది. 2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనున్నది. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన రూ.500 లఘు దర్శనం టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుంచి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన రూ.500టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన రూ.500టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.