అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయడంలో విఫలమయ్యారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను వైసీపీ ప్రభుత్వం తామే చేసినట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టులు ఒక్కటైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. ఒకరు అమరావతి, మరొకరు విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.