అమరావతి : ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏడుగురు కూలీలతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడగా ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. జిల్లాలోని కలకుర్రు వద్ద ఏడుగురితో కూడిన నాటుపడవ మరో ప్రాంతానికి వెళ్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఏడుగురిలో లక్ష్మి, శారద అనే ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.