అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవాని భక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 25 మంది భవాని భక్తులు ఉన్నారు. స్వల్పంగా గాయపడ్డ క్షతగాత్రులను ప్రాథమిక చికిత్సను అందజేశారు. మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.