తిరుపతి : తిరుపతి(Tirupati) గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకార్ల ( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం(Bhashyakarla Utsav) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర (Sattumora) , ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, అధికారులు పాల్గొన్నారు.