అమరావతి : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత ఎన్టీ రామారావుతో పాటు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్
రెడ్డికి కూడా భారతరత్న ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోరారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. పెట్రోధరలపై చంద్రబాబు పోరాటం చేయాలని సూచించారు.
ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని అన్నారు. చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ వారసుడవుతాడని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా భారతరత్నపై డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్ గుర్తు వస్తారని, అతడి పేరు పలికే అర్హత కూడా బాబుకు లేదని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికలలో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని అన్నారు.