అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నికకు నామినేష్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికల పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్రియ ప్రసాద్ను నియమించారు . ఈనెల 25 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసిన మేరకు ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
నామినేషన్ దాఖలుకు చివరి తేది జూన్ 6 వరకు, జూన్ 7న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణ, 23న పోలీంగ్ నిర్వహించనున్నారు. 26 ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.