తిరుపతి : పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రేపటి నుంచి బాలాలయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్10వ తేదీ వరకు మూడురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నవంబరు 9న ఉదయం, సాయంత్రం వేళల్లో యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు. నవంబరు 10న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలతో ప్రారంభించి ఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 10.20 నుంచి 10.40 గంటల మధ్య ఆవాహన ప్రోక్షణ(బాలాలయం), ఆచార్య బహుమానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.