హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీ రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని ఆయన కుమారుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ ప్రకటించారు. శక పురుషుని శత జయంతి పేరుతో సంవత్సరం పాటు ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఉన్న పెమ్మసాని థియేటర్లో వేడుకలను ప్రారంభిస్తామని తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా తమ కుటుంబం నుంచి నెలకు ఒకరు చొప్పున ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. శత జయంతి వేడుకల్లో వారానికి ఐదు సినిమాలు ప్రదర్శిస్తామని, రెండు సదస్సులు నిర్వహిస్తామని బాలకృష్ణ చెప్పారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు.