తాడేపల్లి: ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్, త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.
దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సమయంలోనే ముస్లింలు పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్ళడం సంప్రదాయంగా భావిస్తారన్నారు.
భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి అభిలషించారు.