Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ రికార్డు సృష్టించింది. గత ఎన్నికల్లో ఆమె భర్త దాసరి వెంకట సుబ్బయ్య సాధించిన మెజారిటీని ఆమె క్రాస్ చేసింది. 90 వేలకు పైచిలుకు మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని 90,228 ఓట్ల మెజారిటీని సాధించారు. అంటే ఇది ఆమె భర్త మెజారిటీ కంటే దాదాపు రెట్టింపు.
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను ఎంపిక చేసింది.