అమరావతి : నెల్లూర్ జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేశారు. మందుకోసం జనం భారీగా రావడంతో పంపిణీ కష్టతరంగా మారింది. కొవిడ్ నేపథ్యంలో జనం పొటెత్తుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మళ్లీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా రేపటి నుంచి సువిశాలామైన మైదానంలో మందు పంపిణీకి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి అధికారులను కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.