అమరావతి : వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ(CBI) కార్యాలయంలో విచారణకు రావాలని అవినాష్రెడ్డికి వాట్సప్ ద్వారా నోటీసులు(Notice) పంపింది .ఇప్పటికే ఈ నెల 16,19వ తేదీల్లో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.
నిన్న సీబీఐ విచారణకు బయలు దేరిన అవినాష్ రెడ్డి మార్గమధ్యలో తల్లి అనారోగ్యం సమాచారం అందడంతో హుటాహుటినా తన కారును పులివెందుల వైపు నాటకీయ పరిణాలమాల మధ్య మళ్లించి తల్లికి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని, మరో తేదీన వస్తానని సీబీఐ ఫోన్లో సమాచారం అందించారు. దీంతో పాటు తన తరుఫున న్యాయవాదుల(Advocates) చేత లిఖిత పూర్వక లేఖను సమర్పించారు. కాగా రెండు సార్లు ఏదో ఒక సాకుతో గైర్హాజరవుతున్న అవినాష్రెడ్డి తీరును తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్న సీబీఐ సోమవారం తీసుకునే నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది .