విశాఖపట్నం : ఆంధ్ర యూనివర్శిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వివిధ యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నది. బీఏ/బీకాం/బీఎస్సీ, ఎంఏ/ఎంజేఎంసీ/ఎంహెచ్ఆర్ఎం/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ/ఎంసీఏ, ఏడాది పీజీ డిప్లొమా కోర్సులు, 6 నెలల సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఆన్లైన్ ప్రోగ్రాముల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆంధ్ర వర్శిటీలో దూర విద్యలో ప్రవేశాలు ఏడాదిలో రెండు సార్లు (జనవరి-ఫిబ్రవరి, జూలై-ఆగస్ట్) జరుగుతాయి.
అకౌంటెన్సీలో బీకాం, సోషియాలజీలో ఎంఏ కోర్సులను ఆన్లైన్లో అందిస్తున్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 10 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తారు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆంధ్ర యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.andhrauniversity.edu.in లో సంప్రదించాలి.