అమరావతి : అమరావతి ( Amaravati ) అక్రమాలు బయటకు రావొద్దని చంద్రబాబు , లోకేష్ కుట్ర పన్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లిన వైసీపీ( YCP ) నాయకులపై పోలీసుల సాక్షిగా దాడులకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు పేర్నినాని ( Perni Nani ) అంబటి రాంబాబు( Ambati Rambabu ) ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన టీడీపీ గూండాలే రాళ్లు రువ్వి గాయపరిచారని విమర్శించారు. రైతుల విజ్ఞప్తితోనే జగన్ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. రైతుల భూముల్లో మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కారుపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారని పేర్కొన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని , దాడులను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటామని, లోకేష్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎవరెంత రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. టీడీపీ దాడులను లెక్కచేయబోమని తెలిపారు.