అమరావతి : విశాఖ జిల్లా మారికవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు కుట్టడం ఆలస్యమైందని టైలర్ బొడ్డు లిమా(60)పై ఆరుగురు యువకుల దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెను కేజీహెచ్ ఆస్పత్రిలోచేర్పించగా చికిత్సపొందుతూ ఈరోజు మృతి చెందింది . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.