అమరావతి : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం వైఎస్ జగన్( YS Jagan)పై చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకులు ముప్పెట దాడికి పాల్పడ్డారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆదివారం షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) మాట్లాడుతూ వైఎస్ జగన్ను 16 నెలల పాటు జైల్లో పెట్టినా కాంగ్రెస్ గురించేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవటానికి, రాజధాని అభివృద్ధి కోసం, పోర్టులకు నిధుల తెచ్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. షర్మిల పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను(Special Status) కాంగ్రెస్ ఎందుకు విభజన చట్టంలో పెట్టలేదని మంత్రి ఉషశ్రీ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, సోనియానే కారణమని ఆరోపించారు.
చంద్రబాబుకు మేలు చేకూరే విధంగా ఆరోపణలు ..
ఏపీలో వైఎస్ జగన్ను, వైసీపీ పార్టీని ఇబ్బందులపాలు చేసేందుకే షర్మిల తప్పుడు ఆరోపణలు చేస్తుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil kumar Yadav) అన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డికి చిరకాల ప్రత్యర్థి, శత్రువైన చంద్రబాబుకు మేలు చేకూరే విధంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేస్తున్నారా, కాంగ్రెస్ను వెనుకుండి నడిపిస్తున్న చంద్రబాబుకా ? గుండెల్లో మీద చేయేసుకుని ఆలోచించాలన్నారు. ఒక్క పొరపాటు చేస్తే చరిత్ర కూడా క్షమించదని, చరిత్రపుటల్లో మాయని మచ్చగా నిలిచిపోతారని షర్మిలకు సూచించారు.