అమరావతి : తల్లి,దండ్రుల క్షణికావేశం చిన్నారుల ప్రాణం మీదకు వస్తుంది . భార్య, భర్తలమధ్య మనస్పర్ధాలు అభం,శుభం ఎరగని చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వాటర్ వర్క్స్ కాలనీకి చెందిన ఇద్దరు దంపతులు మధ్య నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశంలో మూడు నెలల చిన్నారిని తండ్రి నేలకేసి కొట్టడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.