అమరావతి : కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న బాలిక లైంగిక దాడికి గురైంది. హాస్టల్ నిర్వాహకుడు విజయకుమార్ అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె గర్భందాల్చింది. సెలవులో ఇంటికి వచ్చిన బాలికకు గర్భస్రావంకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు గర్భస్రావం కావడంతో అనుమానంతో తల్లి వాకబు చేయగా లైంగిక దాడి విషయాన్ని తల్లికి వివరించింది.
కరోనా మందు పేరిట బాలికకు మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టినట్లు తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా పరీక్షించిన వైద్యులు నిందితుడు అఘాయిత్యంతో బాలిక గర్భందాల్చిందని, అనంతరం గర్భస్రావం అయ్యిందని వైద్యులు నిర్దారించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారిలో ఉండగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.