అమరావతి : పల్నాడు జిల్లా (Palnadu District ) నరసరావుపేటలో దారుణం జరిగింది. కొందరు యువకులు ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపిన ఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తుంది. నరసరావుపేటలో బుధవారం సాయంత్రం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. దీంతో కంగారు పడ్డ వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్(Police Station) లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసును నమోదు చేసి అప్రమత్తమయ్యారు.
సీరియస్గా తీసుకున్న పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దశలో ఇద్దరు బాలికలు గృహ నిర్బంధంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి బాలికలను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.
యువకులు శీతల పానీయంలో(Cool Drink) మత్తుమందు కలిపి బాలికలకు ఇవ్వడంతో వాటిని తాగిన ఇద్దరూ స్పృహ పడిపోవడంతో వారిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.