అమరావతి : ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీటి కుళాయి (Water tap) కోసం ఓ కర్కశ కుమారుడు తల్లిదండ్రులను( Parents) దారుణంగా చంపిన ఘటన సంచలనం కలిగించింది. జిల్లాలోని బొండపల్లి గ్రామం ఎస్సీకాలనీలో ఇద్దరు దంపతుల నివశిస్తున్నారు. వీరికి లక్ష్మణ్ అనే కుమారుడు ఉన్నాడు.
శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న నీటి కుళాయి విషయంలో తండ్రి రాము (55), తల్లి జయలక్ష్మి(45)తో గొడవ పడ్డాడు. దీంతో తీవ్రస్థాయిలో ఆవేశానికి లోనైన కుమారుడు తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపివేశాడు. అడ్డువచ్చిన స్థానికులను సైతం బెదిరించడంతో వారు మిన్నకుండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.