అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం జరిగింది. సరదాగా క్రికెట్ (Cricket) మ్యాచ్ జరుగుతుండగా చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందడం కలకలం సృష్టించింది.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని హుస్సేన్నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా వివాదం చెలరేగింది . దీంతో 16 ఏళ్ల బాలుడు 14 ఏళ్ల బాలుడి గొంతు, గుండెపై గట్టిగా కొట్టడంతో కుప్పకూలి చనిపోయాడు. మృతుడు 9వ తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.