Atchannaidu | ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ నేతల మాట్లాడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారుగా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు లేఖ రాశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు.