అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొనసాగుతున్న కె. దయానంద్ నుంచి చార్జ్ తీసుకున్నారు. ఇటీవల మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది. ఈ మేరకు ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.
ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శిగాగా కొనసాగుతున్నారు. గతంలో రాజ్ భవన్ కార్యదర్శిగా పనిచేసి గవర్నర్ అభినందనలు అందుకున్నారు. మరో రెండేళ్లలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తాడన్న నమ్మకంతో మీనాను ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది.