అమరావతి : విశాఖపట్నం దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట. డిప్యూటీ కమిషనర్పై అసిస్టెంట్ కమిషనర్ ఇసుక, మట్టితో దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు ఆఫీసులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తనపై అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని, కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్దన్పై దాడికి పాల్పడింది. కాగా ఈ ఆరోపణలను పుష్ప వర్దన్ ఖండించారు. విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాగా ఓ ఉద్యోగి సస్పెన్షన్ విషయంలో అధికారులు ఇరువురి మధ్య వివాదం నెలకొన్నట్లుగా సమాచారం. మరోవైపు అధికారుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు. వీరు ఇలా కొట్లాడుకుంటుంటే ప్రజలకేం సేవలు అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.